చరిత్రలో ఈరోజు - ఫిబ్రవరి 14
జాతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు
- ఇంటర్ నేషనల్ కండోమ్ డే,
- ప్రేమికుల దినోత్సవం
సంఘటనలు
- 1349: ఐరోపాలో బ్లాక్ డెత్ బుబోనిక్ ప్లేగు వ్యాప్తికి తప్పుడు సంబంధం ఉందని వందలాది
మంది యూదులను ఫ్రాన్స్లోని స్ట్రాస్బర్గ్లో సజీవ దహనం చేశారు.
- 1556 : అక్బర్ మొఘల్ సామ్రాజ్యానికి పట్టాభిషేకం
చేశాడు.
- 1797: అడ్మిరల్ జాన్ జెర్విస్ నేతృత్వంలోని బ్రిటిష్ నావికాదళం, కేప్ సెయింట్ విన్సెంట్ యుద్ధంలో పెద్ద స్పానిష్ నౌకాదళాన్ని ఓడించింది.
- 1876: అలెగ్జాండర్ గ్రాహం బెల్ టెలిఫోన్ కోసం పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు.
- 1929: చికాగోలో సెయింట్ వాలెంటైన్స్ డే ఊచకోత జరిగింది. అల్ కాపోన్ ఆదేశాల మేరకు
ఏడుగురు ప్రత్యర్థి గ్యాంగ్స్టర్లు చంపబడ్డారు.
- 1989: మొదటి GPS ఉపగ్రహాన్ని ప్రయోగించారు.
- 1989 : భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు కారణమైన
యూనియన్ కార్బైడ్ భారత ప్రభుత్వానికి $470 మిలియన్ల నష్టపరిహారం
చెల్లించింది.
- 2005: స్టీవ్ చెన్, చాడ్ హర్లీ మరియు జావేద్ కరీం ప్రముఖ వీడియో-షేరింగ్ వెబ్సైట్ యూట్యూబ్ను
ప్రారంభించారు.
- 2018 : అంతర్జాతీయ మైనింగ్ సదస్సు - 2018 హైదరాబాదులో ప్రారంభం.
- 2019 : జమ్ము శ్రీనగర్ జాతీయ రహదారిలో భారతీయ సైనికులను తీసుకువెళ్తున్న వాహనాల కాన్వాయ్
మీద లేథిపురా (అవంతిపురా సమీపంలో) కారుతో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఈ దాడి కారణంగా
40 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) సైనికులు, ఒక ఉగ్రవాది మరణించారు
జననాలు
- 1898: దిగవల్లి వేంకటశివరావు, స్వాతంత్ర్య యోథుడు, సాహిత్యాభిలాషి, అడ్వకేటు. (మ.1992)
- 1921: దామోదరం సంజీవయ్య, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి. (మ.1972)
- 1932: ఘంటా గోపాల్రెడ్డి, వ్యవసాయ శాస్త్రవేత్త, ఎత్తిపోతల పథకం
రూపకర్త (మ.2018)
- 1952: సుష్మాస్వరాజ్, భారతీయ జనతా పార్టీ మహిళా నాయకురాలు.
- 1990: దీక్షా సేథ్ , దక్షణాది భాషల నటి
మరణాలు
- 1779: జేమ్స్ కుక్, ఆంగ్ల-నావికుడు, సముద్ర యానికుడు, సాహస యాత్రికుడు. (జ.1728)
- 1973: యెర్రగుడిపాటి వరదరావు, తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, నటుడు. (జ.1903)
- 1974: వి.రామచంద్ర రావు , తెలుగు సినిమా దర్శకుడు , నిర్మాత,రచయిత (జ.1926)
- 1975: పి.జి.ఉడ్హౌస్, ఆంగ్ల హాస్య రచయిత. (జ.1981)
- 1983: రాజబాబు, తెలుగు సినిమా హాస్యనటుడు. (జ.1935)
- 1984: సి.హెచ్. నారాయణరావు, తెలుగు సినిమా నటుడు. (జ.1913)
- 2010: నవలా రచయిత డిక్ ఫ్రాన్సిస్.
- 2018: బోళ్ల బుల్లిరామయ్య, మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి. (జ.1926)
- 2022: ఎల్లసిరి శ్రీనివాసులు రెడ్డి ఆంధ్రప్రదేశ్
రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. (జ.1944)
మరి కొన్ని విశేషాలు క్లుప్తంగా
దామోదర సంజీవయ్య ( 14 ఫిబ్రవరి 1921- 8 మే 1972)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి, తొలి దళిత ముఖ్యమంత్రి. సంయుక్త మద్రాసు రాష్ట్రములో, ఆంధ్ర రాష్ట్రములో, ఆంధ్ర ప్రదేశ్
రాష్ట్రములో, కేంద్ర ప్రభుత్వములో అనేక మార్లు మంత్రి
పదవిని నిర్వహించాడు. రెండుసార్లు అఖిల భారత కాంగ్రేస్ కమిటీ అధ్యక్షుడు అవడము కూడా
ఈయన ప్రత్యేకతల్లో ఒకటి. ఈయన కాంగ్రేసు పార్టీ తొలి దళిత అధ్యక్షుడు కూడా. 38 సంవత్సరాల పిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన ఘనత ఈయనకే దక్కింది.
వాలెంటైన్స్ డే
క్రీస్తు శకం 270లో మత గురువు వాలెంటైన్ ను ఫిబ్రవరి 14న రోమ్ నగరాన్ని పాలించే క్లాడియస్ అనే రాజు ఉరితీయించాడు. అందువల్ల
ప్రతి సంవత్సరం ఆ రోజును వాలెంటైన్స్ డే గా జరుపుకుంటారు. “ప్రేమికుల దినోత్సవం” ఆ
రోజున ప్రధానంగా యువతీ యువకులు తాము ప్రేమించిన వారికి, ప్రేమించామనుకునే వారికీ తమ ప్రేమను వ్యక్తపరుస్తుంటారు. అది
ఆయా ప్రేమికుల జీవితంలో ప్రేమ ఉన్నంతకాలం ఒక ప్రత్యేకమైన రోజుగా ఉంటుంది. ఫిబ్రవరి
14 కోసం చాలా మంది యువతీయువకులు ఎదురుచూస్తుంటారు.
సుష్మాస్వరాజ్ (14 ఫిబ్రవరి 1952 – 6 ఆగస్టు 2019) :
బీజేపీకి చెందిన ముఖ్య నేతల్లో ఒకరైన సుష్మా
స్వరాజ్ ఆ పార్టీలో ఎన్నో కీలక పదవులను అధిరోహించారు. కాగా సుష్మా స్వరాజ్ 1952 ఫిబ్రవరి 14వ తేదీన జన్మించారు. ఢిల్లీ
ముఖ్యమంత్రి, కేంద్రమంత్రిగా సుష్మా స్వరాజ్ పనిచేశారు.
1970లో రాజకీయ ప్రవేశం చేసిన సుష్మా స్వరాజ్ విద్యార్థి సంఘం నాయకురాలిగా
ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టారు. ఇప్పటికీ రాజకీయాల్లో ఉన్న మహిళ నేతలందరికీ
సుష్మా స్వరాజ్ స్ఫూర్తిగా నిలుస్తూ ఉంటారు. సుష్మాస్వరాజ్ ను తెలంగాణ చిన్నమ్మగా పిలుచుకుంటారు